బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో గత నెల 24న ఏడడుగులు వేసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాఘవ్ చద్దాతో చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉంటూ వార్తల్లో నిలిచిన పరిణీతి.. ఫైనల్ గా ప్రియసుఖుడితోనే మూడు ముళ్లు వేయించుకుంది.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కెజ్రీవాల్ తో రాజకీయ, సినీ ప్రిముకులు రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా వివాహ వేడుకలో సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే పెళ్లై నెల కూడా కాలేదు. భర్తను వదిలేసి పరిణీతి చోప్రా మరొకరితో మల్దీవ్స్ కు చెక్కేసింది. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.
వివాహం తర్వాత భర్తతో కలిసి పరిణీతి చోప్రా ఏ ఫారెన్ కో హనీమూన్ కు వెళ్తుందని అందరూ భావించారు. కానీ, రాఘవ్ చద్దాకు ఆమె హ్యాండిచ్చింది. కారణం తెలియదు గానీ.. భర్తను వదిలేసి కజిన్ సిస్టర్ తో పరిణీతి చోప్రా మల్దీవ్స్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అక్కడ వాటర్ లో దిగిన ఓ ఫోటోను ఇన్స్టాలో పంచుకుంటూ.. `నేను హానిమూన్కు వెళ్లలేదు. ఈ ఫోటోను నా కజిన్ తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్` అని పరిణీతి చోప్రా పేర్కొంది. దీంతో ఆమె పోస్ట్ కాస్త వైరల్ గా మారడంతో.. నెటిజన్లు హనీమూన్ కు ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram