ఇండ‌స్ట్రీలోకి పవన్ కళ్యాణ్ కూతురు.. ఆద్య ఫిల్మ్ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

చాలా ఏళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణు దేశాయ్ వెండితెర‌పై మెర‌వ‌బోతోంది. `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` మూవీతో ఆమె రీఎంట్రీ ఇవ్వ‌బోతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. అక్టోబ‌ర్ 20న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో రేణు దేశాయ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది.

ఈ నేప‌థ్యంలోనే గ‌త కొద్ది రోజుల నుంచి రేణు వ‌రుస ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతుంది. వృత్తి ప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంటోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా త‌న కూతురు ఆద్య ఫిల్మ్ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రేణు దేశాల‌కు ఇద్ద‌రు సంతానం అన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ తో స‌హ‌జీవ‌నం చేస్తూ కొడుకు అకీరా నంద‌న్ కు జ‌న్మ‌నిచ్చిన రేణు.. పెళ్లి త‌ర్వాత ఆద్య జ‌న్మ‌నిచ్చింది. రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం త‌ర‌చూ త‌న కొడుకు, కూతురిని క‌లుస్తూనే ఉంటాడు.

పిల్ల‌ల బాధ్య‌త‌ను ప‌వ‌న్ క‌ళ్యాణే తీసుకున్నాడు. అయితే పవన్ అభిమానులందురూ అకీరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, అకీరా మాత్రం సినిమాల‌పై పెద్ద‌గా మ‌క్కువ చూప‌ట్లేదు. పోని ప‌వ‌న్ కూతురు ఆద్య అయినా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తుందా..? అనే ప్ర‌శ్న తాజాగా రేణు దేశాయ్ కు ఎదురైంది. అందుకు ఆమె బ‌దులిస్తూ.. `ఆద్యకి ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక ఉంది. చిన్నప్పుడు నుంచి అదే ఆలోచనతో ఉంది. త్వరలో కాలేజీలో కూడా జాయిన్ కాబోతుంది` అని తెలిపింది. ఫైన‌ల్ గా ఆద్య ఫిల్మ్ ఎంట్రీ లేన‌ట్లే అని ప‌రోక్షంగా రేణు తేల్చేసింది.