మెగా హీరోతో జతకట్టబోతున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కెరియర్ ప్రస్తుతం అయోమయంలో ఉందని చెప్పవచ్చు.. రెండేళ్లుగా పూజ హెగ్డే కి సరైన సక్సెస్ రాలేదు.. హిట్ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయా అంటే వచ్చిన అవకాశానన్న ఈ అమ్మడు రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల మహేష్ సినిమాలో ఇమే తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి అయితే అందుకు గల కారణం ఏంటి అనే విషయం మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎలాంటి సినిమాలు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియడం లేదు.

ఇవన్నీ పక్కన పెడితే ఎట్టకేలకు తాజాగా ఒక పెద్ద ప్రాజెక్టులో నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ హీరోలతో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ తో నటించబోతున్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. కానీ అది కుదరలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన గాంజా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలు నటిస్తున్నట్లు సమాచారం.

ఇటీవలె విరుపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న సాయి ధరమ్ తేజ్.. తన తదుపరి సినిమా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తన చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి సంపత్ నంది కాక మరొకటి గాంజా శంకర్ దర్శకత్వంలో ఎక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈమె డేట్స్ ఇచ్చిన వెంటనే సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోందట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ ఆమ్మడి కెరియర్ మాత్రం ఈ సినిమా మీద ఆధారపడిందని చెప్పవచ్చు.