టాలీవుడ్ లో ఆ ఇద్దరు గొప్ప హీరోలు.. నటుడు షాయాజి షిండే కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల‌లో షాయాజ్ షిండే కూడా ఒకడు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన షిండే ఆ పాత్రలకు ప్రాణం పోసాడు. పోలీస్ ఆఫీసర్ రోల్స్ లో షాయాజీ షిండే కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పోకిరి సినిమాలో షిండే చెప్పిన తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా డైలాగ్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోరు. అరుంధతి సినిమాలోని పాత్ర కూడా షాయాజీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

 

సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించిన ఈయన తన శని కెరీర్లో 200కు పైగా సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమాల్లో నటించడం గురించి షాయాజీ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. నాకు టాలీవుడ్ డైరెక్టర్లు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని.. దర్శకుడు పూరి జగన్నాథ్ నాకు లైఫ్ ఇచ్చాడని షాయాజ్ షిండే పరోక్షంగా చెప్పుకొచ్చాడు. పోకిరి సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చిందని ఆ మూవీ తర్వాత విభిన్నమైన రోల్స్ లో నటించే అవకాశాలు వ‌చ్చాయ‌ని ఆయన వివ‌రించాడు.

డేట్ ఎడ్జ‌స్ట్ చేయ‌లేక‌ హిందీ పోకిరిలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నానని కామెంట్స్ చేశాడు. చిరంజీవి చాలా బాగా మాట్లాడుతారని ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పండి అని చిరంజీవి నాతో చెప్పేవారంటే చెప్పుకొచ్చాడు. మనమంతా ఆర్టిస్టులమని.. మనది ఒకటే కుటుంబం అంటూ ఆయన చెప్పేవారిని.. చిరంజీవి నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ల చూస్తారని వివ‌రించాడు. మహేష్ , జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో గ్రేట్ స్టార్స్ గా ఉంటారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఛాయాజీ షిండే చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి