నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజ్ కుటుంబంలో తాజాగా విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.వయసుకు సంబంధించిన సమస్యలతో అనారోగ్య కారణంగా గత కొద్ది రోజులుగా బాధపడుతున్నటువంటి ఈయన కొన్ని గంటల క్రితం మరణించినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజుకు ఇది చాలా పెద్ద దెబ్బ అని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ ప్రముఖులు ఆయన సన్నిహితుల సైతం దిల్ రాజుకు ధైర్యాన్ని చెబుతున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతగా పంపిణీదారుడుగా ఎగ్జిక్యూటర్ గా దిల్ రాజు అందరికీ సుపరిచితమే..తెలుగులో ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. అలాగే హిందీ, తమిళ చిత్రాలకు కూడా ఆర్థిక సహాయంగా నిలుచున్నారు దిల్ రాజ్.. దిల్ రాజ్ కెరియర్ లోనే రెండు జాతీయ చలనచిత్ర అవార్డును సైతం గెలుచుకోవడం జరిగింది. దిల్ రాజ్ స్వస్థలం తెలంగాణలోని నిజామాబాదులోని నరసింగపల్లిలో జన్మించారు. ఈయన చదువు కూడా చిన్న వయసు నుంచి అక్కడే చదువుతున్న సమయంలో సినిమాల పైన ఆసక్తి ఉండడంతో ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి తన సోదరులతో కలిసి ఆటోమొబైల్ వ్యాపారం మొదలుపెట్టారట.

దిల్ రాజు మొదటిసారి 1997 లో పెళ్లి పందిరి అనే చిత్రంతో పంపిణీదారుడుగా పనిచేశారట ..1998లోనే శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్ను సైతం ప్రారంభించడం జరిగిందట. దిల్ రాజు భార్య అనితను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. వీరికి హన్సితా రెడ్డి అని కుమార్తె కూడా ఉన్నది. దిల్ రాజు మొదటి భార్య 2017లో గుండెపోటుతో మరణించడంతో మళ్ళీ 2020వ సంవత్సరంలో తేజస్విని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక కుమారుడు కూడా