హర్రర్ తో భయపెట్టేస్తున్న ఓంకార్.. మ్యాన్షన్ 24 ట్రైలర్..!!

ఒకప్పుడు యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఓంకార్ ఇప్పుటికి వెండితెర పైన బుల్లితెర పైన తనదైన స్టైల్ లో ముందుకు వెళుతూ ఉన్నారు. మొదట్లో అపజయాలు ఎదురైనప్పటికీ ఆ తర్వాత హర్రర్ కామెడీ లాంటి కాన్సెప్ట్ ని ఎంచుకోవడంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా రాజు గారి గది సక్సెస్ కావడంతో అదే పాయింట్తో కంటిన్యూ చేస్తూ రెండు మూడు చిత్రాలను చేశారు. దీంతో పర్వాలేదు అనిపించుకున్న ఓంకార్ మళ్లీ ఇప్పుడు తాజాగా ఒక హర్రర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఓంకార్ మెన్షన్ 24 అనే వెబ్ సిరీస్ తో డైరెక్టర్గా మారారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్ ఈనెల 17 నుంచి స్ట్రిమింగ్ కాబోతోంది. అయితే రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది ఇందులో కూడా ఓంకార్ తన మార్కుతో మరొకసారి భయపెట్టేస్తూ ఉన్నారు. ఇందులో హర్రర్ సన్నివేశాలు హైలెట్ గా కనిపిస్తున్నాయి ఒక బంగ్లా వెళ్లిన తండ్రి కనిపించకుండా పోవడంతో కూతురు అయిన వరలక్ష్మి ఆయనను వెతుక్కుంటూ వెళుతుంది.

 

అలా తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన సమయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చివరికి తన తండ్రిని గుర్తిస్తుందా లేదా అనే కథ అంశంతో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఆ మ్యాన్షన్ లోకి ఎవరు వెళ్లినా కూడా తిరిగిరాని పాయింట్ని హైలెట్ చేస్తున్నారు ఓంకార్. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ అదిరిపోయిందంటూ పలువురు నీటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు మరి ఈ ప్రాజెక్టులో చాలామంది ఆర్టిస్టులు సైతం ఉన్నారు. మరి ఎవరు ఎలా సక్సెస్ అవుతారో చూడాలి.