మరాఠీ భామ మృణాల్ ఠాగూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న మృణాల్.. గత ఏడాది సీతారామం మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీతామహాలక్ష్మి పాత్రలో అందం, అభినయం, నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈ అమ్మడు హాయ్ నాన్నతో పాటు విజయ్ దేవరకొండతో ఓ సినిమా, నితిన్ తో ఓ సినిమా చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మృణాల్ కు సంబంధించి ఓ షాకింగ్ మ్యాటర్ లీకైంది. అదేంటంటే.. రేచీకటి జబ్బుతో మృణాల్ ఠాగూర్ బాధపడుతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మృణాల్ కు రేచీకటి సమస్య ఉందని తెలియాగానే ఫ్యాన్స్ షాకైపోతున్నారు. విషయం ఏంటంటే మృణాల్ కు నిజంగా రేచీకటి కాదు. ఈ బ్యూటీ బాలీవుడ్లో ‘ఆంఖ్ మిచోలీ’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో రేచీకటి ఉన్న అమ్మాయి పాత్రలో మృణాల్ నటిస్తోంది. ఆ విషయాన్ని దాచేసి, వరుడిని వెతికేపనిలో ఉన్నారంట ఆమె కుటుంబసభ్యులు.
తాజాగా ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో మృణాల్ స్వయంగా వెల్లడించింది. ఇటువంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి అని.. నటిగా తనకిది ఓ ఛాలెంజ్ లాంటిదని మృణాల్ తెలిపింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో పెళ్లెప్పుడు? అని ప్రశ్నించగా.. `కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగానే ఉంది. కాకపోతే నన్ను భరించేవాడు అసలు ఉన్నాడా అనేది నా డౌట్. ప్రస్తుతానికైతే నాకు కాబోయే వాడిని నేను వెతకడం లేదు` అంటూ మృణాల్ నవ్వేసింది. దీంతో మృణాల్ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.