రిలయన్స్ జియో ఒకవైపు నెట్వర్క్ మరొకవైపు స్మార్ట్ మొబైల్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి జియో భారత్ సిరీస్లలో మరో కొత్త మొబైల్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. jio Bharath -B1 పేరుతో ఈ మొబైల్ ని తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్న V2,K1 మొబైల్ కార్బన్ మోడల్ కంటే అదనపు ఫీచర్స్ తో ఈ సరికొత్త మొబైల్ ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ మొబైల్ 4G మొబైల్ గత మోడల్ మొబైల్ తో పోలిస్తే స్క్రీన్ చాలా పెద్దదిగా ఉంటుంది..
jio Bharath -B1 సిరీస్ మొబైల్ ధర విషయానికి వస్తే.. రూ.2,599 రూపాయలు ఉండగా 50 శాతం డిస్కౌంట్తో ఈ రూ.1299 రూపాయలకి అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో 4G మొబైల్స్ లో ఇది కూడా ఒకటి.. ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే..2000 MAH కలదు..2.4 అంగుళాల స్క్రీన్ కూడా కలదు. ఈ మొబైల్ వెనుక భాగంలో కూడా కెమెరా కలదు. ఇక ఎందుకు సంబంధించిన ఫోటోలను సైతం జియో వెబ్సైట్లో అధికారికంగా పోస్ట్ షేర్ చేయడం జరిగింది.
UPI పేమెంట్స్ కోసం ఇందులో జియో పేని ఆటోమేటిక్గా ఉంచడం జరిగిందట 23 భాషలకు ఇది సపోర్ట్ చేస్తుందని వివరించారు.అయితే ఇందులో జియో సిమ్ కాకుండా ఇతర సిమ్ములను మాత్రం ఉపయోగించలేము కేవలం ఈ మొబైల్ నలుపు రంగులో మాత్రమే అందుబాటులో ఉన్నది జియో వెబ్సైట్ తో పాటు పలు ఈ కామర్స్ సంస్థలలో కూడా ఈ మొబైల్ లభిస్తోంది. అన్ని రకాల ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నట్లు తెలియజేసింది.