బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్.. ముఖ్య అతిథులు వీరే..!

తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి ఎలాగైనా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకోసం ప్రజలలో ఆసక్తి పెంచడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఈసారి ఆడియన్స్ లో ఎలాగైనా సరే ఆసక్తి పెంచడానికి నేడు జరగబోయే సండే ఎపిసోడ్లో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు ఇప్పటికే నాగార్జున క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఐదవ వారానికి వచ్చేసింది.

ఇప్పటికే మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీలా, మూడో వారం దామిని, నాలుగవ వారం రతిక ఎలిమినేట్ అవ్వగా నేడు జరగబోయే సండే ఎపిసోడ్ ఊహించని ట్రిస్టులతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. శుభశ్రీ , ప్రియాంక జైన్ ఇద్దరూ కూడా ఎలిమినేట్ అవుతారనే వార్తలు మరింత వైరల్ గా మారాయి. మరొకవైపు ఈరోజు మినీ లాంచ్ ఈవెంట్ జరగబోతుండగా హౌస్ లోకి ఆరు మంది కొత్త సభ్యులు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టబోతున్నారు..కెవ్వు కార్తీక్, అర్జున్ అంబటి, నయని పావని, అశ్విని శ్రీ, భోలే షావలి ,పూజ మూర్తి హౌస్ లోకి సభ్యులుగా ప్రవేశిస్తున్నారు.

Actor Siddharth: Stop persecuting the film industry | Onmanorama

ఇక వీరి ఎంట్రీ కోసం అదిరిపోయే మినీ ఈవెంట్ ప్లాన్ చేసిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈవెంట్ కోసం ముఖ్య అతిథులుగా మాస్ మహారాజా రవితేజ, హీరో సిద్ధార్థ లను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఏడు గంటల నుంచి ఈవెంట్ ప్రసారం అవుతుంది. మరొకపక్క డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొనిందని చెప్పవచ్చు. మరి ఈ సండే ఫండే ఎపిసోడ్ ఎంత వినోదాత్మకంగా ఉంటుందో చూడాలి.