ముంబైలో తళుక్కుమన్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్.. విషయం ఏమిటబ్బా?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటైన ఈ చూడముచ్చట జంట అంటే మెగాభిమానులకు చాలా క్రేజ్. ఇక త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇకపోతే ఎప్పటినుంచో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ వీరు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మెంటైన్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించగా ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పడేస్తూ వచ్చారు కూడా. ఒకానొక దశలో అవన్నీ పుకార్లు మాత్రమే అని నమ్మబలికారు కూడా. అయితే ఎట్టకేలకు ఆ వార్తలకు పులిస్టాప్ పెడుతూ ఇటీవలే లావణ్య వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ వేడుక మెగా ఇంట్లో అతి కొద్ది మంది సన్నిహితులు బంధువుల సమక్షంలో జరిగిన విషయం విదితమే.

ఆ మద్య దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియా వెద్కగా వైరల్ కావడం మనం చూశాము. కాగా ఎంగేజ్మెంట్ తర్వాత ఈ జంట తరచూ విదేశాలకు వెళుతూ కనిపించడంతోపాటు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇంకొక నెలలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుందని గుసగుసలు వినబడుతున్నాయి. అవును, ఐదేళ్ల స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని జూన్ లో పెద్దల సాక్షిగా నిశ్చితార్థంతో ఒక్కటిగా మారిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు నవంబర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రెడీ అవుతున్నారు. కాగా ఇప్పటికే పెళ్ళికి సంబందించిన షాపింగ్ మొదలు పెట్టేసింది ఈ జంట.

 

ఇక్కడ హైదరాబాద్ లోనే వరుణ్, లావణ్యల వెడ్డింగ్ షాపింగ్ జరుగుతోందని మెగా సన్నిహితులు చెప్పుకుంటున్నారు. కాగా ఇటలీ వేదికగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్స్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ వేదిక, ఆ ఈవెంట్ కి సంబందించిన ఏర్పాట్లని వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు స్వయంగా చూసుకుంటున్నారు. కాగా తాజాగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లు ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించగా ఫోటో గ్రాఫర్స్ వాళ్ళ వెంట పడ్డారు. వెంటనే వారి ఫొటోస్ ని తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.