మృణాల్ ఠాకూర్ కూడా హైదరాబాద్ కోడలంటూ బాంబు పేల్చిన అల్లు అరవింద్..!!

మొదట బాలీవుడ్లో పలు సీరియల్స్ లో నటిస్తు మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టు బొట్టుతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించి గ్లామర్ డోస్ భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.. దీంతో మృణాల్ ఠాకూర్ ను అభిమానులు అలా చూడలేకపోయారు.

వెబ్ సిరీస్లలో కూడా తన అందచందాలతో కుర్రకారులను మైమరిపించేలా చేసింది. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో నానితో కలిసి హాయ్ నాన్న విజయ్ దేవరకొండ తో కలిసి మరొక సినిమాల నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ కూడా టాలీవుడ్ హీరో ఇంటికి కోడలు కాబోతోంది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

అయితే ఇంతకు అసలు విషయంలోకి వెళ్తే సైమా అవార్డు ఫంక్షన్ లో సీతారామం చిత్రానికి గాని ఉత్తమ నటి అవార్డు అందుకోవడం జరిగింది. ఈ అవార్డును అల్లు అరవింద్ చేతుల మీదుగా తీసుకుంది మృణాల్ ఠాకూర్.. ఇక అదే సమయంలో స్టేజి మీద అల్లు అర్జున్ తాను గతంలో ఒక వేదికపై ఒక హీరోయిన్ గురించి నువ్వు హైదరాబాద్ అబ్బాయిని వివాహం చేసుకోమని సూచించాను ఇప్పుడు ఆమె వివాహం చేసుకోబోతోంది నువ్వు కూడా హైదరాబాద్ అబ్బాయిని వివాహం చేసుకోమని తెలుగు ఇండస్ట్రీకి కోడలిగా రా అని అల్లు అరవింద్ చెప్పడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది. గతంలో లావణ్య త్రిపాఠి ని కూడా ఇలాగే చెప్పడంతో ఆ వార్తను నిజం చేసింది. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఈ అమ్మడు కూడా టాలీవుడ్ కోడలు అవుతుందేమో చూడాలి మరి.