నాగచైతన్య పై మోజు పడుతున్న బుల్లితెర నటి..!!

మొదట బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది బుల్లితెర నటి రీతూ చౌదరి. కానీ జబర్దస్త్ షోలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి ఇమే క్రేజ్ మరింత పెరిగిపోయింది. తాజాక ఆలీ హొస్టుగా వ్యవహరిస్తున్న ఆలీతో ఆల్ ఇన్ వన్ ప్రోమో రిలీజ్ కావడం జరిగింది.ఈ ప్రోమో లో రీతూ చౌదరి చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి. యాంకర్ ఆలీ ఏ ఊరు మీది అని రీతూ చౌదరిని అడగగా ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అని సమాధానం.

తాను ఇక్కడ ఉంటానని అక్కడ ఉంటానని కూడా తెలిపింది. ఒక గేమ్ లో భాగంగా అల్లు అర్జున్ ఫోటోను రీతూ చౌదరి కరెక్ట్ ప్లేస్ లో పెట్టక ఆలీ ఆమెను అల్లు అర్జున్ ఫ్యాన్ అని అడగగా.. రీతు చౌదరి తాను నాగచైతన్యను పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీలోకి వచ్చానంటూ తెలియజేసింది రీతూ చౌదరి..జోక్ గా చెప్పిందా సీరియస్గా చెప్పిందా అనే ప్రశ్న మాత్రం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది. ఈనెల 26వ తేదీన రాత్రి 9:30 నిమిషాలకు ఈ షో ప్రారంభం కాబోతోంది.

ఇంస్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను అందాల విందుతో కుర్రాలను టెంప్ట్ చేస్తూ ఉంటుంది రీతూ చౌదరి. గతంలో కూడా ప్రముఖ బిజినెస్ మాన్ రాజకీయ నాయకుడిని ప్రేమిస్తున్నట్లుగా తెలియజేసింది త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. సడన్గా రీతూ చౌదరి తండ్రి మరణించడంతో మళ్లీ ఈ విషయం ఎక్కడ వినిపించలేదు.. గత నెలలో రీతూ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు మళ్ళీ షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం నీతో చౌదరి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.