బాలయ్య, తమన్నా కాంబోలో మిస్ అయిన బ్లాక్ బాస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్న శ్రీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాల అవుతున్న ఇప్ప‌టికి అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎన్నో హిట్ మూవీస్ తన ఖాతాలో వేసుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ బాలయ్యతో మాత్రం ఎటువంటి సినిమాలో నటించలేదు. దీనికి సంబంధించి న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతంలో బాలయ్య – తమన్న కాంబోలో సినిమా అవకాశం వచ్చిందని.. అయితే ఏవో కారణాలతో తమన్ననే సినిమాను రిజెక్ట్ చేసిందంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇక నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఇటీవల నటించిన అఖండ మూవీ టాలీవుడ్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. అయితే అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ పాత్రకు ముందుగా తమన్ననే హీరోయిన్గా అనుకున్నారట.

అప్పట్లో ఆమె సిటిమార్, మాస్ట్రో, ఎఫ్‌3 సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోయిందట‌. దీంతో ఆమె ప్లేస్ లో ప్రగ్యాజైష్వాల్‌ను తీసుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ టాక్ ద‌క్కించుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరి కాంబోలోనే ఈ సినిమా వచ్చి ఉంటే మరింత అద్భుతంగా ఉండేది అంటూ బాలయ్య – తమన్న ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.