ఆ దెబ్బకు రెమ్యూనరేషన్ తగ్గించేసిన స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో మాస్ యాక్షన్ హీరోగా పేరు సంపాదించారు హీరో గోపీచంద్.. ఈ మధ్యకాలంలో ఈ హీరో నటించిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. తాజాగా డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ఓపెనింగ్స్ రోజు గత కొద్ది రోజుల క్రితమే మొదలైంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ ఏడాది రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టడమే మైనస్ అని చెప్పవచ్చు.

Gopichand32: Director Sreenu Vaitla joins forces with Gopichand for an  entertainer

అయితే శ్రీను వైట్ల కూడా ఈ మధ్యకాలంలో వరుసగా డిజాస్టర్ లతో ఉండడంతో మినిమం బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీచంద్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తగ్గించేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.. రామబాణం సినిమాకి రూ .8 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న గోపీచంద్.. శ్రీను వైట్ల సినిమాకి ఏకంగా రూ .5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

నిర్మాతలు ఒప్పందముతో పాటుగా వరుస ప్లాప్స్ పడడంతో గోపీచంద్ మార్కెట్ కూడా కాస్త తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోని రెమ్యూనరేషన్ తగ్గించుకొని మరి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు డైరెక్టర్ హీరో ఇద్దరు కూడా సక్సెస్ కావడం ముఖ్యము.. వరుస ప్లాపుల కారణంగా బడ్జెట్ కూడా ఈ సినిమాకి పెద్దగా పెట్టలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించి మిగిలిన క్యాస్టింగ్ చిత్ర బృందం త్వరలోనే అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.