అందుకే లియో సినిమాలో నటించలేదు.. విశాల్ కామెంట్స్ వైరల్..!!

విక్రమ్ సినిమా తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. అలా కోలీవుడ్ హీరో విజయ్ దళపతితో లియో సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్ తో పాటు,సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కాబోతోంది.

Fans think Vishal will work in Vijay's upcoming film with Lokesh Kanagara -  Hindustan Times

నటుడు విశాల్ ,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం మార్క్ ఆందోని.. ఇందులో హీరోయిన్గా రీతు వర్మ నటిస్తూ ఉండగా సెల్వ రాఘవన్, సునీల్ సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో.. విశాల్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు రకాల ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. తాజాగా విశాల్ లియో సినిమాలో ఆఫర్ రావడంతో అందులో నటించకపోవడానికి గల కారణాన్ని తెలియజేయడం జరిగింది.

విజయ్ దళపతి హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వస్తున్న చిత్రం లియో.. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నటుడు విశాల్ ని డైరెక్టర్ సంప్రదించారట.. అప్పటికె తాను మరొక సినిమాలో నటిస్తూ ఉండడంతో తన డేట్లు అడ్జస్ట్ కాలేక ఈ సినిమాని తిరస్కరించారని తెలియజేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ ఈ విషయాన్ని తెలియజేశారు.. స్టోరీ బాగా నచ్చినప్పటికీ నటించలేకపోయానని అయితే తను ఎలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాలో నటించలేకపోయానని విషయాన్ని డైరెక్టర్ లోకేష్ అర్థం చేసుకొని ఆస్థానంలో అర్జునుని తీసుకున్నారని తెలియజేశారు విశాల్..