10 సెకండ్ల రాషె ప్రింట్ తో మైండ్ బ్లాక్ చేసిన ” దేవర ” .. సినిమా కోసం ఎదురుచూస్తున్నా..!!

దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు మూవీ టీం. ఈ సినిమా అనుకున్న టైం కల్లా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సినిమా షూటింగ్లు సరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ ₹100 నానం లాంచింగ్ కార్యక్రమాలు కూడా పాల్గొనలేకపోయాడు.

ఇది ఇలా ఉంటే ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు.. ఫిలిం క్రిటిక్ అయినా ఉమైర్ సంధు దేవర మూవీ గురించి అదిరిపోయే మాట చెప్పాడు. 10 సెకండ్స్ ర‌ష్ ప్రింట్ చూశాను. నా మైండ్ బ్లాక్ అయింది. ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది ఈ ఎపిక్ సాగా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ ట్విట్ చేశాడు. ప్రస్తుతం ఉమైర్ సందు ట్విట్‌తో ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాంటిది ఎప్పుడు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలిచే ఉమైర్ సందు హీరోలు, హీరోయిన్ల మధ్య పుకారులను రాజేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసే క్రిటిక్ ఒక్కసారిగా ఎన్టీఆర్ సినిమాను హైలైట్ చేయడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కేకాక ప్రేక్షకులు అందరికీ ఆసక్తి పెంచేసింది. ఇక ఈ సినిమాలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.

ఇదే ఆమెకు టాలీవుడ్ లో మొదటి సినిమా కావడం విశేషం. ఆచార్య మూవీతో ఫ్లాప్‌ని ఎదుర్కొన్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో సినిమాను రూపొందిస్తున్నాడు. సముద్ర నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.