విడుద‌ల‌కు ముందే లాభాల్లో `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`.. ర‌వితేజ మాస్ ర‌చ్చ ఇది!

మాస్ మ‌హారాజా ర‌వితేజ వ‌చ్చే నెల‌లో `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ ఇది. 70, 80 ద‌శ‌కాల్లో తెలుగు రాష్ట్రాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్ దాదాపు రూ. 50 కోట్ల‌తో ఈ సినిమాను నిర్మించారు.

ఇందులో నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భారీ రేణు దేశాయ్ ఈ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను సైతం కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 20న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే విడుద‌ల‌కు ముందే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు లాభాల బాట ప‌ట్టింది.

కాన్సెప్ట్ యూనిక్ గా ఉండ‌టంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీంతో బిజినెస్ ప‌రంగా ర‌వితేజ మాస్ ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను మేక‌ర్స్ దాదాపు రూ. 55 కోట్ల‌కు విక్ర‌యించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో రూ. 20 కోట్లు, నైజాంలో రూ. 10 కోట్లు, ఓవ‌ర్‌సీస్‌లో రూ. 6 కోట్ల వ‌ర‌కు ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇతర ఏరియాల్లో కూడా సాలిడ్ ఆఫర్స్ వ‌చ్చాయ‌ట‌. మొత్తంగా ఈ సినిమాకు థియేట్రిక‌ల్ బిజినెస్ రూ. 55 కోట్లు జ‌రిగింద‌ని.. విడుద‌ల‌కు నెల రోజుల ముందే నిర్మాత‌లు లాభాలు సొంతం చేసుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఇక డిజిట‌ల్‌, శాటిలైట్‌తో పాటు డ‌బ్బింగ్ రైట్స్ డీల్ కూడా త్వ‌ర‌లోనే క్లోజ్ కాబోతోంది.