సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ `మిస్ట్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` బాక్సాఫీస్ వద్ద ఎక్సలెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి పి. మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
పాజిటివ్ టాక్ పవర్ తో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే క్లీన్ హిట్ గా నిలిచి లాభాల బాట పట్టేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెర్ రూ. 13.5 కోట్లు. అయితే ఆరు రోజుల రన్ ను కంప్లీట్ చేసిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.90 కోట్ల షేర్, రూ. 15.70 గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 15.89 కోట్ల షేర్, రూ. 30.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఒక ఓవర్సీస్ లోనే ఈ చిత్రానికి ఏకంగా రూ. 5.75 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం మీద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసి.. ప్రస్తుతం అనుష్క, నవీన్ మూవీ రూ. 2.39 కోట్ల లాభాలతో ముందుకు సాగుతోంది. కాగా, సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో నిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. విభిన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమాను మహిళల కోసం ఫ్రీగా ప్రదర్శించేందుకు రెడీ అయ్యారు. సెప్టెంబర్ 14న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నగరాల్లోని కొన్ని థియేటర్లలో ఈ సినిమాను ఫ్రో షో వేయబోతున్నట్లు యూవీ క్రియేషన్స్ వారు అనౌన్స్ చేశారు.