యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఎంత త్వరగా ఫామ్ లోకి వచ్చిందో.. అంతే త్వరగా ఫామ్ ను కోల్పోయింది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తో గ్రాండ్ గా తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి.. మొదటి సినిమాతో ఇక్కడ స్టార్ అయింది. ఆ తర్వాత శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. కృతి శెట్టికి తిరుగే లేదని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగలేదు.
ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ సినిమాలతో కృతి శెట్టి వరుస పరజయాలను మూటగట్టుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు కరువయ్యాయి. నటన పరంగా, గ్లామర్ పరంగా మరియు డాన్స్ పరంగా కృతికి వంకబెట్టవలసిన పనిలేదు. కానీ, వరుసగా నాలుగు ఫ్లాపులు పడటం ఆమెకు పెద్ద మైనస్ గా మారింది. అయితే కృతి శెట్టికి తమిళ్, మలయాళ భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.
ఇప్పటికే మలయాళంలో టోవినో థామస్ కు జోడీగా `అజయంతే రందం మోషణం` అనే మూవీకి కమిట్ అయింది. మరోవైపు కోలీవుడ్ లో జయంరవితో ` జెనీ` అనే మూవీ చేస్తోంది. అయినా కూడా కృతి శెట్టి సంతృప్తిగా లేదు. తెలుగులో ఆఫర్ల కోసం ఈ అమ్మడు ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే తనకు పరిచయం ఉన్న దర్శకులు, హీరోలకు ఫోన్ చేసి.. ఆఫర్లు ఇప్పించదని అడుగుతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మరి నిజంగానే ఆఫర్ల కోసం కృతి శెట్టి అంతకు దిగజారిందా అన్నది తేలాల్సి ఉంది.