తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ వంటి భాషలలో కూడా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ ప్రియమణి.. ఈమె అందచందాలతో పాటు నటనతో కూడా అందరిని ఆకట్టుకొని మంచి విజయాలను అందుకుంది.. ఇక హీరోయిన్గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించింది ప్రియమణి.ఇప్పటికీ బుల్లితెర వెండితెర పైన తన హవా కొనసాగిస్తూనే ఉన్నది.
అయితే ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రియమణి. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. కెరియర్ బాగా సాగుతున్న సమయంలో ముస్తఫా రాజును ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. అయితే అప్పటికె ఆయనకు అమేశా అనే అమ్మాయితో వివాహమై పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ ప్రియమణి ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ప్రియమణి తన భర్త నుంచి విడిపోతున్నట్లు వార్తలయితే వినిపించాయి కానీ అందులో నిజం లేదని ప్రియమణి క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ప్రియమణి వివాహమే చాలా సంవత్సరాలు అవుతున్న పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు పడుతోందని విషయం వినిపిస్తోంది.. సినిమా అవకాశాలు తగ్గుతాయని కారణంతోనే ప్రేమని ఇంకా పిల్లల్ని కనడం లేదని గ్లామర్ దెబ్బతింటుందని కోలీవుడ్ మీడియాలో ఇలాంటి రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రియమణి యుటైరస్ మరియు థైరాయిడ్ అనే వ్యాధులతో బాధపడుతోందట ఈ కారణంగానే ఈమెకు పిల్లలు పుట్టడం కష్టమని వైద్యులు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.