రూ.6 కోట్ల నష్టాన్ని ఇచ్చేయండి.. విజయ్ దేవరకొండపై ప్రముఖ నిర్మాత ఘాటు వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ హీరోగా, టాలీవుడ్ హీరోయిన్ సమంత కథానాయికగా వచ్చిన ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే విశాఖపట్నంలో ఖుషి సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. త్వరలో హైదరాబాద్ నిర్వహించనుంది. ఖుషి సినిమా హిట్ అయిన ఆనందంలో ఇటీవల విశాఖలో జరిగిన సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కీలక ప్రకటన చేశాడు. 100 మంది ఫ్యాన్స్ కుటుంబాలను ఎంపిక చేసిన ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందిస్తానని తెలిపాడు.

 

ఈ క్రమంలో ఒక ప్రముఖ నిర్మాత చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రముఖ సినీ నిర్మాత అభిషేక్ పిక్చర్స్ ఒక వివాదాస్పద ట్వీట్ చేసింది. వరల్డ్ ఫేమస్ సినిమా ఫ్లాప్ అయినందుకు తమకు రూ.6 కోట్ల నష్టం వచ్చిందని, అవి కూడా తిరిగి ఇవ్వాలని ట్వీట్ చేశారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు తాము డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు రూ.6 కోట్ల నష్టం వచ్చిందని, ఆ నష్టాన్ని విజయ భరించాలని ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ కుటుంబాలకు రూ.కోటి ఇస్తానని చెబుతున్న విజయ్.. నష్టపోయిన ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను కూడా ఆదుకోవాలని సూచించారు.

 

అయితే అభిషేక్ పిక్చర్స్ పెట్టిన పోస్టుపై విజయ్ దేవరకొండ ట్రెండ్స్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక రిప్లై వచ్చింది. డియల్ అభిషేక్ పిక్చర్స్. వరల్డ్ ఫేమస్ లవర్ బిజినెస్ అగ్రిమెంట్ ఎన్‌ఆర్‌ఐ బేసిక్ లో జరిగిందని, ఆ సినిమా లాభ, నష్టాలకు సంబంధం లేని మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. మీరు అర్జున్ రెడ్డి సినిమాకు వెస్ట్ గోదావరి జిల్లాలో డిస్టిబ్యూషన్ చేసి భారీ లాభాలు తెచ్చుకున్నారని,వాటిని మీరు తిరిగి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. విజయ్ దేవరకొండను టార్గెట్ చేయాలనుకుంటే నిర్మాతల నుంచి ఏదైనా అడిగి తెలసుకోండి అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.