చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఎదిగారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి.. స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. దేవవ్యప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు.
అయితే చిరంజీవి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక సీరియల్ లో నటించారని మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే. ఫ్యాన్స్ లో కూడా చాలా మందికి ఇది తెలియదు. ఇంతకీ చిరంజీవి-షారుఖ్ కలిసి నటించిన ఆ సీరియల్ పేరంటే `రజనీ`. ఇదొక హిందీ సీరియల్. 1985లో దూరదర్శన్లో ఈ సీరియల్ ప్రసారం అయ్యేది. బసు ఛటర్జీ దర్శకుడు కాగా.. ప్రియా టెండూల్కర్ ఇందులో ప్రధాన పాత్ర పోషించింది.
అప్పట్లో ఈ సీరియల్ కు ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది. అయితే ఈ సీరియల్ లోని కొన్ని ఎపిసోడ్స్ లో చిరంజీవి ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాగే షారుఖ్ ఖాన్ కూడా రెండు ఎపిసోడ్స్ లో గెస్ట్ రోల్ ను ప్లే చేశారు. అప్పట్లో ఈ సీరియల్ పెద్ద హిట్ అయింది. కానీ, సీరియల్కు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు టెలివిజన్ కార్యాలయం ముందు నిరసనకు దిగాయి. దాంతో రజనీ సీరియల్ ను కొద్ది నెలలకు ఆపేశారు. ఇక చిరంజీవి మరియు షారుఖ్ ఒక సీరియల్ లో నటించారని చాలా మందికి ఇంత వరకు తెలియదు.