సమంత-చైతు మళ్లీ కలవబోతున్నారా.. సమంత చేసిన పనికి షాక్ లో ఫ్యాన్స్..!!

టాలీవుడ్లో హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఇప్పటికీ వీరు విడాకులు తీసుకున్న విషయాన్ని నమ్మలేకపోతున్నారు. సమంత, చైతన్య విడిపోవడానికి అసలు కారణం ఏంటని విషయం ఇప్పటికీ తెలియజేయలేదు. అయితే వీరిద్దరూ విడిపోయిన ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉంటున్నారు. ఏంమాయ చేసావే సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.

Samantha reveals she has already married to Chaithu

కొన్ని మనస్పర్ధలు కారణంగా 2021 లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం ఇంస్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫోటోలను బయటకు కనపడకుండా Archive పెట్టింది సమంత. తాజాగా వారి పెళ్లి ఫోటోలను మళ్లీ un archive చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వెంటనే మళ్ళీ కనిపించకుండా పోయిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ లేపుతోంది. సమంత చేసిన పనికి అర్థం ఏంటని పలువురు అభిమానులు సైతం బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే సమంత, చైతన్యాన్ని మర్చిపోలేక పోతోందా అంటూ మరొకసారి నెట్టింట వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

సమంత, చైతన్య విడాకులు అయ్యి రెండేళ్లు కావస్తున్న ఇప్పటివరకు వీరి లైఫ్ లో మరొకరు రాలేదు. దీంతో సమంత, చైతన్య మళ్ళీ కలుసుకోవాలని ఉద్దేశం ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. విడిపోయి రెండేళ్లు అయిన తర్వాత పెళ్లి ఫోటోలను సమంత un archive చేసిందంటే అసలు విషయం ఏమంటుందో అంటు పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి ఏంటన్న విషయం త్వరలోనే తెలుస్తుంది.