మరణించే వరకు ఆ కష్టాలు వదలవేమో.. సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్..!!

తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు వచ్చినప్పటికీ జబర్దస్త్ షో ద్వారా పాపులారెడ్డి సంపాదించిన కమెడియన్స్ చాలామంది ఉన్నారు.. అలాంటి వారిలో జబర్దస్త్ జీవన్ కూడా ఒకరు.. జీవన్ కామెడీ టైమింగ్ తో ఎంతోమంది అభిమానులను సైతం ఆకట్టుకున్నారు. అయితే ఆ తర్వాత రోజుల్లో అనారోగ్య సమస్యల వల్ల జబర్దస్త్ షోకు దూరం కావాల్సి వచ్చిందట. తాజాగా ఒక షోకు హాజరైన జీవన్ తన కన్నీటి కష్టాల గురించి వెల్లడించడం జరిగింది.

జీవన్ మాట్లాడుతూ ఒక పేరు వచ్చిన తర్వాత తన కష్టాలకు చెక్ పడుతుందనుకున్నాను.. కానీ పేరు వచ్చిన తర్వాత కూడా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలియజేశారు జీవన్.. మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఆలోచనతోనే తన ఇండస్ట్రీ లోకి వచ్చానని కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కించిన మహాత్మ సినిమాలోని “నీలపూరి గాజుల ఓ నీలవేణి” అనే సాంగ్ ను మేమే పాడమని తెలియజేశారు. అయితే ఆ పాటని తాము పాడమని ఎక్కడ పేరు వేయలేదని తెలియజేశారు జీవన్.

అక్కడే స్ట్రక్ అయిపోయామని ఆ తర్వాత ఫణి అన్న అభి అన్నని తమకు పరిచయం చేశాడని తెలిపారు జీవన్.. అలా జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ తమ మీద దేవుడు కరుణ చూపలేదని జీవన్ తెలియజేయడం జరిగింది. దేవుడు చావు అంచుల వరకు తనని తీసుకువెళ్లాడని తెలిపారు.. చిన్నప్పటినుంచి నాకు అన్ని కష్టాలే ఈ కష్టాలు మరణించే వరకు వెంటాడుతూనే ఉంటాయి ఏమో అంటూ తెలిపారు జీవన్.. జీవం చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈయన అభిమానులు మాత్రం జీవ మా కెరియర్ పరంగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.