సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత రాబోతున్న సినిమా `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి`. పి. మహేష్ బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
ఈ క్రమంలోనే తన పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చింది. పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారు? అని ప్రశ్నించగా.. అందుకు అనుష్క ఇప్పట్లో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవంటూ సమాధానం ఇచ్చింది. అయితే పెళ్లికి తాను వ్యతిరేఖిని కాదు.. పెళ్లినేది మంచి విజయం కాబట్టి కుదిరినప్పుడు ఖచ్చితంగా అందరికీ చెబుతాను అంటూ ఆమె పేర్కొంది. అయితే ఇప్పట్లో పెళ్లి ప్లాన్స్ లేవని అనుష్క చెప్పడం ఫ్యాన్స్ కి షాక్ లా తగిలింది. అసలే అనుష్క ఏజ్ 41. పెళ్లే కాదు పిల్లలను కనే వయసు కూడా దాటిపోయింది.
అయినా సరే అనుష్క పెళ్లి విషయంలో ఇంత నెమ్మదిగా ఉండటం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోలేదు. ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో ప్రభాస్ ప్రస్తావన రాగా.. అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. `2005 నుంచి ప్రభాస్ నాకు తెలుసు. అప్పటికీ ఇప్పటికీ అతని స్థాయి మారినా ప్రభాస్ ఏం మారలేదు. అతను నాకు వెరీ వెరీ డియర్ ఫ్రెండ్. అందుకే ప్రభాస్ తో ఎప్పుడూ క్లోజ్గానే ఉంటాను. రాజమౌళి ఫ్యామిలీతోనూ నేను అంతే ఫ్రెండ్లీగా ఉంటాను` అంటూ అనుష్క చెప్పుకొచ్చింది.