మెగా హీరోతో రొమాన్స్ చేయడానికి అనుష్క రెడీ..

మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఇటీవలే విడుదల అయ్యి నెగిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మొహార్ రమేష్ తెరకేక్కించిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద పరాజయం పాలయ్యిన విషయం అందరికి తెలిసిందే. దాంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరింత ఆచి తూచి అడుగేస్తున్నాడు చిరు. తాజాగా బింబిసారా సినిమా దర్శకుడి దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి తన 157 వ సినిమా ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

యూవి క్రియేషన్స్ సంస్థ వారు భారీ బడ్జెట్ తో చిత్రికరిస్తున్న ఈ సినిమా ని సోషియో ఫాంటాసి ఎంటర్టైనర్ గా తెరకేక్కిస్తున్నారు. ఈ సినిమా కి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రీసెంట్ గా జరిగింది. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ ప్రారంభం కాభోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమా కి సంబందించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క నటించబోతుందని ప్రచారం గట్టిగ జరుగుతుంది. అలానే మెగాస్టార్ చిరంజీవి కూడా తన 157 వ సినిమా లో అనుష్క ని హీరోయిన్ గా తీసుకోవడం లో సుముఖంగానే ఉన్నారట. అయితే ఈ వార్తపై మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో తెరకేక్కనున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే తెలియనున్నాయి.