నిర్మాతతో ప్రేమలో ప్రముఖ హీరోయిన్….అసలు విషయం తెలిసి దూరం!

హీరోయిన్ అంటే తెర పై అందాలు ఆరబోయ్యల్సిందే అన్నది చాలా మంది అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు. కానీ స్క్రీన్ పై ఎటువంటి ఎక్సపోసింగ్ చెయ్యకుండా, టాలెంట్ ను నమ్ముకొని స్టార్ లుగా ఎదిగిన హీరోయిన్లు కూడా ఉన్నారు. తెలుగు పరిశ్రమలో చూస్తే సావిత్రి, భానుమతి, జమున, సౌందర్య….ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో ముఖ్యంగా చేర్చవల్సిన మరో హీరోయిన్ స్నేహ. తెలుగుతో పాటు, అన్ని దక్షిణాది పరిశ్రమల్లో నటించిన స్నేహ, హోమ్లీ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. స్నేహ ప్రముఖ నటుడు ప్రసన్న కుమార్ ను ప్రేమించి పెళ్లాడారు. వివాహం అనంతరం సినిమాలు దూరంగా ఉన్న స్నేహ, బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం ద్వారా తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

స్నేహ ముంబై లో జన్మించినప్పటికీ ఆమె మూలాలు ఆంధ్ర లోనే ఉన్నాయ్. ఆమె పూర్వికులు రాజమండ్రి వాస్తవ్యులు. కానీ ఆమె తల్లిదండ్రులు రాజారామ్, పద్మావతి వ్యాపార రీత్యా ముంబై కు వలస వెళ్లిపోయారు. స్నేహ కూడా అక్కడే జన్మించారు. స్నేహ కు, ప్రసన్నతో వివాహమయ్యి 11 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటివరకు తన వైవాహిక జీవితంలో ఎటువంటి మనస్పర్థలు లేకుండా సంతోషంగా జీవిస్తోంది. వీళిద్దరిని చూసిన ప్రతిఒక్కరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కితాబు ఇవ్వాల్సిందే. ఐతే స్నేహ, ప్రసన్నను పెళ్లాడక ముందు, మరో వ్యక్తిని ప్రేమించారని షాకింగ్ కామెంట్స్ చేసారు తమిళ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్ రాంగనాథన్.

స్నేహ తన భర్త ప్రసన్నను ప్రేమించాక ముందు తమిళ నిర్మాత రవి తో ప్రేమలో ఉండేవారట. ఈ ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లిందట. డైమండ్ రింగ్స్ మార్చుకొని నిశ్చితార్ధం కూడా చేసుకున్నారట. కానీ నిశ్చితార్ధం అయ్యాక స్నేహ కు రవి పై అనుమానం కలిగిందట. అతను తనను మనస్పూర్తిగా ప్రేమించడం లేదని గ్రహించిందట. అందుకే అతన్ని పెళ్లి చేసుకోవడం సరికాదని ఆ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేశారట స్నేహ. ఆ సంఘటన తరువాత స్నేహ కు ప్రసన్న తో పరిచయం ఏర్పడిందట. కానీ అప్పటికే ప్రేమ పట్ల నమ్మకం కోల్పోయిన స్నేహ, మొదట్లో ప్రసన్నను కూడా దూరంగా పెట్టిందట. కానీ కొన్నాళ్ళకు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చారు బైల్వాన్ రాంగనాథన్.