ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్‌… భార‌త్ మ్యాచ్‌ల టిక్కెట్లు సోల్డ్ అవుట్‌..!

భారత్ ప్రపంచ కప్పు మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టికెట్లు కోసం ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూశారు. మీరు క్యూలో ఉన్నారు దయచేసి కాసేపు వేచి ఉండండి అనే నోటిఫికేషన్ ఇస్తూనే.. కాస్త గంట నుంచి 10 గంటల వరకు కూడా చూపించింది. చివరకు కొద్దిసేపట్లోనే అది కాస్త సోల్డ్ అవుట్ బోర్డుతో ఉండ్ చేశారు. వన్డే వరల్డ్ కప్ టికెట్ల కోసం మంగళవారం ఆన్లైన్లో ప్రయత్నించిన భారత అభిమానులు చాలామందికి నిరాశ ఎదురయింది.

భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్ లకు సంబంధించిన మాస్టర్ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి బుక్ మై షో లో టికెట్ అందుబాటులో ఉంచారు. కానీ కొన్ని గంటల్లోనే అన్ని మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు 9 మ్యాచ్లకు కూడా సోల్డ్ అవుట్ అనే చూపిస్తుంది. నిజానికి గత బుధవారం బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు భారత లీగ్ మ్యాచ్ లకు సాధారణంగా అభిమానుల కోసం దసలవారీగా టికెట్లు అమ్మాలి.

కానీ నినే టికెట్స్ సోల్డ్ అవుట్‌ అంటే పూర్తిగా అమ్ముడుపోయాయా.. లేక పరిమిత సంఖ్యలో మాస్టర్ కార్డ్ వినియేగ‌దారుల‌కోసం కోసం పెట్టిన టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయా అనే సందేహాలు క్రికెట్ అభిమానుల్లో మొదలయ్యాయి. అస్సలు టికెట్ల సంఖ్య విషయంలో ఏం స్పష్టత లేదు ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆ డేట్లలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు.