టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాల్సిన చాందిని చౌద‌రి.. ఆ నిర్మాత చేసిన ప‌నికి బ‌లైపోయింద‌ని తెలుసా?

చాందిని చౌద‌రి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విశాఖపట్నంలో జ‌న్మించిన ఈమె.. ఇంజనీరింగ్ చ‌దువుతున్న రోజుల్లోనే న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ప‌లు షార్ట్ ఫిల్మ్ లో న‌టించింది. అలా వ‌చ్చిన గుర్తింపుతో.. సినిమాల్లోకి వ‌చ్చింది. చిన్న చిన్న పాత్ర‌లు పోషించింది. కుందనపు బొమ్మ మూవీతో హీరోయిన్ గా మారింది.

ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దాంతో మ‌ళ్లీ సైడ్ క్యారెక్ట‌ర్ల‌కే ప‌రిమితం అయిన చాందిని చౌద‌రి.. క‌ల‌ర్ ఫోటోతో తొలి హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ మూవీ ద్వారా ఆమె అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత సమ్మతమే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ప్ర‌స్తుతం హీరోయిన్ గా నిల‌దొక్కుకోవాల‌ని చాలా క‌ష్ట‌ప‌డుతోంది. అయితే నిజానికి చాంద‌ని చౌద‌రి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా స‌త్తా చాటుతూ ఉండాల్సింది. కానీ, ఓ నిర్మాత చేసిన ప‌నికి ఆమె బ‌లైపోయింది.

టాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద ప్రొడ్యూసర్ రెండు సినిమాల కోసం చాంద‌ని ద‌గ్గ‌ర‌ రెండు సంవత్సరాల డేట్స్ తీసుకున్నాడ‌ట‌. అగ్రిమెంట్ కూడా పూర్తైంద‌ట‌. కానీ, స‌ద‌రు నిర్మాత చాందినితో ఒక సినిమా కాదు క‌దా.. ఒక్క సీన్ కూడా తీయలేద‌ట‌. పైసా రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ట‌. ఇక ఈ రెండు సంవ‌త్స‌రాలు ఒక‌టి రెండు కాదు.. చాందిని నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింది.

డేట్స్ అన్నీ స‌ద‌రు నిర్మాత‌కు ఇచ్చేయ‌డంతో.. ఊహలు గుసగుసలాడే, కుమారి 21ఎఫ్, పటాస్, దృశ్యం వంటి చిత్రాలను చాందిని చేదులారా మిస్ చేసుకుంది. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చాంద‌ని ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించింది. ఒక‌వేళ ఆ నాలుగు సినిమాలు చాంద‌ని చేసుంటే.. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల చెంత కొన‌సాగుతూ ఉండేది అన‌డంలో సందేహమే లేదు.