రష్మీ పై సుడిగాలి సుదీర్ షాకింగ్ కామెంట్స్.. అసలు విషయం ఏమిటంటే..?

బుల్లితెరపై కడుపుబ్బ నవ్వించే కమెడియన్లలో యాక్టర్ సుధీర్ కూడ ఒకరు.జబర్దస్త్ లో ఏన్నో షోలతో అభిమానులకు దగ్గరయ్యాడు. సుధీర్ అలాగే రష్మిక వీరిద్దరి గురించి చెప్పనవసరమే లేదు.. ఒకప్పుడు వీరిద్దరూ పలు షోలతో ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశారు. కానీ ఈ మధ్యన వీరిద్దరూ జంటగా కనిపించడం లేదు. యాంకర్ గా రష్మిక బిజీ అయిపోయింది.అలాగే సుధీర్ కూడా సినిమాలతో బిజీ బిజీగా లైఫ్ ని గడిపేస్తున్నాడు.

తాజాగా వీరిద్దరూ మళ్లీ టీవీ షోలో జంటగా స్క్రీన్ పై కనిపించారు. దీంతో వారిద్దరిని చూసిన వారి ఫాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఆ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో అలాగే సుధీర్ వేసిన డైలాగులు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. సుధీర్ ,రష్మీని ఏవండోయ్ మేడంగారు ఎందుకో కోపంగా ఉన్నారంటూ రష్మీని ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. అందుకు బదులుగా రష్మీ నువ్వు ఇన్నాళ్లు వస్తావని ఎదురు చూశాను అంటూ ఒక చూపు చూస్తూ స్మైల్ ఇచ్చింది.

 

ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ అంటూ సుధీర్ ని ప్రశ్నించింది. ఇంతలోనే సుదీర్ తన స్టైల్లో నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండెల్లోనే ఉంటావు అనే డైలాగ్ ని రష్మీపై కామెంట్స్ చేయడం జరిగింది.. ఇంకేముంది ఈ డైలాగుతో వారి ఫ్యాన్స్ కేకలేశారు. రెండేళ్ల క్రితం ఇలాంటి డైలాగులతో ఎంతగానో అభిమానులను సంపాదించుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇలా మళ్లీ మాట్లాడుతూ ఉండడంతో.. రష్మీ, సుధీర్ ప్రేమించుకుంటున్నారని అలాగే పెళ్లి కూడా చేసుకుంటారని ఇప్పటికీ కూడా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

 

గతంలో ఈ విషయంపై రష్మి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. సుధీర్ కి నాకి మధ్య ఉన్నది నా పర్సనల్ విషయం పర్సనల్ విషయాలు కూడా బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. అలాగే పర్సనల్ అంటేనే మనసులో ఉంచుకోవాల్సిన మాట.ఇక దీనిపై మీరు కామెంట్స్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది అని రష్మీ తెలిపింది. ప్రస్తుతం ఒక ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది.