ఏసిని ఇండస్ట్రీలో నైనా కాస్త స్టాండర్డ్ వచ్చిందంటే చాలు పలు రకాల బ్రాండ్ అంబాసిడర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు.ఎక్కువగా హీరోలు సైతం ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో హీరోయిన్స్ కూడా పలు రకాల సినిమాలను తమ బ్యానర్ పైన నిర్మిస్తూ మంచి లాభాలను అందుకుంటున్నారు. అలా హీరోయిన్స్ గానే కాకుండా నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
1). కృతి సనన్:
నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి పాపులారిటీ అందుకున్నది. బ్లూ బటర్ఫ్లై ఫిలిం మొదలుపెట్టి పలు చిత్రాలను నిర్మిస్తోంది.
2). నయనతార:
తన భర్త విగ్నేశివన్ తో కలిసి నయనతార కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంది రౌడీ పిక్చర్స్ బ్యానర్ పైన ఈమె పలు చిత్రాలను నిర్మిస్తోంది.
3). తాప్సి:
ఝుమ్మంది నాదం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తాప్సి.. బాలీవుడ్ లో కూడా పల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అవుట్ సైడ్ ఫిలిమ్స్ అనే బ్యానర్ ని స్థాపించిన తాప్సి పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటోంది.
4). కంగగన రనౌత్:
ఏక్ నిరంజన్ సినిమా తెలుగు తెరకు పరిచయమైన ఈమె బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది.. మణికర్ణిక అనే ఫిలిం బ్యానర్ పైన పలు చిత్రాలను నిర్మిస్తోంది కంగగన రనౌత్
5). ఆలియా భట్:
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ అనే పేరుతో నిర్మాతగా పలు ప్రాజెక్టులను చేపడుతోంది.
వీరే కాకుండా చాలామంది కూడా నిర్మాతలుగా రాణిస్తున్నారు.