బిగ్‌బాస్ హౌజ్‌లో షకీలా ఎంట్రీ.. ఆమెకు ఎంత పారితోషికం అంటే..

బిగ్‌బాస్ తెలుగు అప్‌కమింగ్ సీజన్ సెప్టెంబర్ 3 నుంచి స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కానుంది. బోల్డ్ పాత్రలకు పేరుగాంచిన ప్రముఖ నటి షకీలా ఈ షోలో పాల్గొంటుందని వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఇతర రూమర్స్ ప్రకారం ఈ సీజన్ 7లో జబర్దస్త్ వర్ష, పల్లవి ప్రశాంత్ కూడా పాటిస్పేట్ చేయనున్నారు. ప్రస్తుతం తనకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నానని, వాటిని వదిలేసి రావాలంటే కాస్త ఎక్కువ మనీ ఇవ్వాలని షకీలా అడిగినట్లు సమాచారం. షో కోసం షకీలా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా స్టార్ మా యాజమాన్యం ఆమె అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుందని సమాచారం.

ఆమె కూడా చివరి వారం వరకు బిగ్ బాస్ హౌస్‌లోనే ఉండాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే చివరికి ఆమెకు భారీ పేచెక్ అందే అవకాశం ఉంది. ఈ ఒక్క షోతో ఆమె ఇక కష్టాలన్నీ తొలగిపోవచ్చు. కంటెస్టెంట్స్ ఎంపికలో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సీజన్‌లో కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మరి ఈసారి షో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ టీవీ షోలో పోటీదారులు బయటి ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అయిపోయి ఒక ఇంట్లో కలిసి జీవిస్తారు. వారిని కెమెరాలు, మైక్రోఫోన్‌ల ద్వారా బాస్ నిరంతరం పర్యవేక్షిస్తారు. పోటీదారులను ప్రజల ద్వారా ఇంటి నుంచి బయటకు పంపుతారు. మిగిలిన చివరి పోటీదారు షోలో గెలుస్తాడు. బిగ్‌బాస్ తెలుగు భారతదేశంలో ప్రముఖ షోగా ఉంది, మునుపటి సీజన్లలో తెలుగు సినిమాల్లోని ప్రముఖులలో కొందరు ఉన్నారు. షకీలా పాల్గొనే పుకార్లతో రాబోయే సీజన్ మరింత ఉత్సాహంగా ఉంటుందని భావిస్తున్నారు.