విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కి ఇచ్చిపడేసిన స‌మంత‌.. ఒక్క దెబ్బ‌తో నోరు మూయించిందిగా!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఎంత స్ట్రోంగ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, మ‌రెన్నో స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేసింది. అన్నిటిని ఒంట‌రిగానే ఎదిరించింది.. పోరాడింది.. గెలిచింది. అలాగే నాగ చైత‌న్యతో విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత‌పై నెగిటివిటీ బాగా పెరిగింది. చిన్న చిన్న విష‌యాల‌కు కూడా ఆమెపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించిన లేటెస్ట్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఖుషి. శివ నిర్వాణ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే ఖుషి ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌ను మొత్తం విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే త‌ల‌కెత్తుకున్నాడు. రీజెంట్ గా ఖుషి ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లోనూ స‌మంత పాల్గొన‌లేదు. దీంతో విజ‌య్ ఫ్యాన్స్ స‌మంత‌ను సోష‌ల్ మీడియా ద్వారా ఏకేస్తున్నారు.

దీంతో స‌మంత‌కు బాగా మండింది. మ‌యోసైటిస్ వ్యాధి కార‌ణంగా ఆమె సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది. బెస్ట్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకు ప్లాన్ చేసుకుంటోంది. వాస్త‌వాలు తెలుసుకోకుండా ప్ర‌మోష‌న్స్ కు హాజ‌రు కాలేద‌నే కార‌ణంతో విజ‌య్ ఫ్యాన్స్ విమ‌ర్శించ‌డం స‌మంత‌కు న‌చ్చ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే వారికి ఇచ్చిప‌డేసింది. ఒక్క పోస్ట్ తో నోరు మూయించింది. `మీరు ఈ స‌మాజం కోసం బ్రతకాల్సిన పనిలేదు. మీ గౌరవం ఏమిటో తెలుసుకోండి. మీ స్థాయిని పెంచుకోండి. మీరు మీ కోసం జీవించండి. మిమ్మల్ని ఈ సమాజం గుర్తించకపోవచ్చు. అది అంత అవసరం లేదు. పది మందిలో ఒకరిలా కాకుండా యూనిక్ గా జీవించండి` అంటూ స‌మంత ఓ నోట్ ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోకుండా.. మీరు మీ కోసం బ్ర‌త‌కండి అంటూ సమంత కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో స‌మంత వార్నింగ్ విజ‌య్ ఫ్యాన్స్ కే అని ప్ర‌చారం జ‌రుగుతోంది.