ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నేషనల్ అవార్డును గెలుచుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంతవరకు ఈ తెలుగు హీరోకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదు. దీంతో ఆ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. దీంతో సినీ, రాజకీయ ప్రములు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రముఖ నటుడు, ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కూడా ఆయన్ను విష్ చేశారు.
అయితే తాజాగా పోసాని ఓ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. అల్లు అర్జున్ తనకు ఎప్పటి నుంచో తెలుసని.. ఎంతో సన్నిహిత్యంగా మాట్లాడతాడని పోసాని పేర్కొన్నాడు. అయితే ఒకసారి అల్లు అర్జున్ పోసాని ఫోన్ చేసి.. ఇంటికి రమన్నాడట. టీ తాగి వెళ్దురుగానీ అని చెప్పాడట. అయితే పోసాని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లగా.. అక్కడ టీతో పాటు రూ. 5 లక్షల చెక్ కూడా చేతిలో పెట్టారట.
బాబు నేనే బాగానే ఉన్నాను, వెల్ సెటిల్డ్ కదా.. నాకెందుకు ఇస్తున్నావ్ అని పోసాని అడడగా.. మీరు డబ్బులు ప్రాపర్గా యూజ్ చేస్తారు సార్. మంచి పనులకు ఉపయోగిస్తారు. అది నాకు బాగా నచ్చింది. చాలా మందికి గుండె ఆపరేషన్లు చేయించారు. కానీ, బయటకు ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈ 5 లక్షలు కూడా మంచి పనికి ఉపయోగించండి అంటూ అల్లు అర్జున్ చెప్పాడట. తాజాగా పోసాని ఈ విషయం బయటపెట్టడంతో.. నెటిజన్లు టీ తాగడానికి పిలిచి రూ.5 లక్షలు ఇచ్చాడా.. అల్లు అర్జున్ నిజంగా గొప్పొడే రా అంటూ అభిప్రాయపడుతున్నారు.