మిల్కీ బ్యూటీ తమన్నా వెకేషన్ కోసం మాల్డీవ్స్ కు చెక్కేసింది. ఇటీవల ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్ 2, జీకర్దా వంటి బోల్డ్ వెబ్ సిరీస్ లతో పాటు భోళా శంకర్, జైలర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. భోళా శంకర్ డిజాస్టర్ అవ్వగా.. జైలర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మిట్ గా నిలిచింది. అయితే బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్లు, సినిమాలు రిలీజ్ అవ్వడంతో.. తమన్నా గత కొద్ది రోజుల నుంచి ఇంటర్వ్యూలో, ప్రెస్ మీట్స్ అంటూ తెగ బిజీగా గడిపింది.
ఇప్పుడు కాస్త ఫ్రీ అవ్వడంతో.. సెలబ్రెటీల ఫెవరెట్ వెకేషన్ స్పాట్ అయిన మాల్దీవ్స్ కు వెళ్లిపోయింది. అక్కడ ఫుల్ గా చిల్ అవుతోంది. అక్కడి అందాలు, ఫుడ్ ను ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటోంది.
తాజాగా బికినీలో కుర్రాళ్లకు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. సోనేవా ఫుషి అనే రీస్టార్ట్ లో దిగిన మిల్క్ బ్యూటీ బీచ్ లో సందడి చేసింది. పింక్ కలర్ బికినీ ధరించి వాటర్ లో ఆడుతూ ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం తమన్నా వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి లేటెందుకు వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.
View this post on Instagram