లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసి ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యాయి. వివాహం అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా నయనతార దంపతులు ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చారు.
ప్రస్తుతం నయనతార ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఇకపోతే నయనతార ఇంతవరకు కుమారుల ఫేస్ చూపించకుండా జాగ్రత్త పడింది. ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా చూపించలేదు. కానీ, తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన నయనతార.. ఫస్ట్ టైమ్ ఇద్దరు కొడుకులను చూపించింది.
కవల కుమారులతో కలిసి తాను దిగిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో మొట్టమొదటిగా షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో నయనతారతో పాటు ఆమె సన్స్ కూడా గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నయనతార కొడుకులు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, నయనతార త్వరలోనే `జవాన్` మూవీ ప్రేక్షకులను పలకరించబోతోంది. బాలీవుడ్ లో ఆమెకు డెబ్యూ మూవీ ఇది. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతోంది.
View this post on Instagram