మంగళగిరిలో లోకేష్ భారీ స్కెచ్..ఓటమి తప్పించుకుంటారా?

ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో నారా లోకేష్ ఉన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి బరిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో అదే స్థానంలో పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే నారా లోకేష్ ఓటమిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎగతాళి చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. మంగళగిరిలో ఓటమి పాలయ్యారని, పప్పు అని ఎగతాళి చేస్తూనే వచ్చారు.

అయితే ఈ సారి ఎన్నికల్లో సీటు మార్చేసుకుంటారని ప్రచారం వచ్చింది. కానీ లోకేష్ ఓడిన చోటే పనిచేస్తూ వచ్చారు. అక్కడ ప్రజలకు అండగా నిలబడ్డారు. సొంతడబ్బులు సైతం ఖర్చు పెట్టి అక్కడ పనులు చేస్తూ వచ్చారు. దీంతో మంగళగిరిలో గెలుపు అవకాశాలు పెరిగాయని సర్వేలు చెప్పాయి. ఇక లోకేష్‌కు మళ్ళీ చెక్ పెట్టాలని జగన్ వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో టి‌డి‌పిలోని కీలక నేతలని వైసీపీలోకి తీసుకొచ్చారు. అలాగే రానున్న ఎన్నికల్లో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాకుండా..ఒక బి‌సి నేతని బరిలో దించాలనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దీంతో లోకేష్ మరింత అలెర్ట్ అయ్యి, అక్కడ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతూ వచ్చారు. కానీ కొంతకాలం నుంచి ఆయన పాదయాత్ర చేయడంతో మంగళగిరిపై ఫోకస్ పెట్టడం లేదు. మళ్ళీ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర మంగళగిరిలో అడుగుపెట్టనుంది. కరెక్ట్ గా ఆగష్టు 15న మంగళగిరిలో అడుగుపెట్టేలా ప్లాన్ చేశారు.

ఈ పాదయాత్రతో మరింత బలం పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే లోకేష్‌కు చెక్ పెట్టడానికి జగన్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తూనే ఉన్నారు. మరి వాటిని ఎదురుకుని లోకేశ్ ఈ సారి ఓటమి తప్పించుకుంటారేమో చూడాలి.