ప్రముఖ డైరెక్టర్ శివా నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను చేపడుతున్నారు చిత్ర బృందం. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా సక్సెస్ అవ్వడం అటు సమంతా ఇటు విజయ్ దేవరకొండ అలాగే డైరెక్టర్ శివ నిర్వాణ కి కూడా చాలా అవసరం అని చెప్పాలి. ముఖ్యంగా ముగ్గురికి కూడా ఈ సినిమా ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్టు అనే చెప్పాలి.
ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్, టీజర్ అన్నీ కూడా సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇక సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అని అటు విజయ్ అభిమానులు, సమంతా అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముగ్గురికి సంబంధించిన పారితోషకాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం రూ .35 కోట్లు తీసుకుంటూ ఉండగా.. సమంత ఏకంగా రూ.4.50కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక డైరెక్టర్ శివ నిర్వాణ ఏకంగా రూ.12 కోట్లు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన డిమాండ్ చేసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళకి కూడా ఎన్ని కోట్లు అవసరమా అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.