ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోలు అయ‌న‌ సూపర్ స్టార్ కృష్ణ, నటరత్న ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు. ఈ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలతో పోటీపడ్డారు. ఇద్దరి హీరోల్లో ముందుగా రాజకీయాలకు వచ్చింది ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోటీ పడినప్పటికీ రాజకీయ రంగంలో మాత్రం కృష్ణ మొదటలో రాలేదు.

నిజానికి కృష్ణ తీసిన 200వ సినిమా ఈనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో పరోక్షంగా సహాయపడింది. ఎన్టీఆర్ రాజకీయాల్లో గెలిచాక ఈనాడు 100 రోజుల సందర్భంగా ఎన్టీఆర్ కి అభినందలు తెలిపితే కృష్ణ ప్రకటన కూడా వేయించారు. ఆదే సమయంలో 1984లో ఇందిరా గాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం ప్రధాని కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారులు తేవడానికి ఎన్నో కసరత్తులు కూడా జరిగాయి.

ఇక అదే సమయంలో కృష్ణను రాజకీయాల్లోకి రావాలని రాజీవ్ గాంధీ స్వయంగా ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ- ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా మరియు ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు సినిమాలు తీయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. ఇక దాంతో కృష్ణ తన సొంత డైరెక్షన్లో వచ్చిన మొదటి మూవీ సింహాసనంలో రాజ గురువు ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను పోలివున్న పాత్ర కైకాల సత్యనారాయణ నటించాడు.

అదేవిధంగా ఈ సినిమాలో వచ్చే ఓ డైలాగ్ ను గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో మాట్లాడిన నా దగ్గరేముంది బూడిద అనే డైలాగ్ ఆ తర్వాత నా పిలుపు ప్రభంజనం మూవీలో ఎన్టీఆర్ పోలిన పాత్రను సత్యనారాయణ పోషించారు. అదే విధంగా ఈ సినిమాల్లో కొన్ని డైలాగ్ లు అప్పటి అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావుతో రాయించారట కృష్ణ. ఇక దాని తర్వాత ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో మండలాధీశుడు మూవీ ని కృష్ణ తీశారు. ఎన్టీఆర్ పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు వేయగా, సీనియర్ నటి భానుమతి ఇందులో నటించడం కూడా పెద్ద సంచలనంగా మారింది.

ఈ మూవీ మొదట్లో కృష్ణ కనిపిస్తారు. అయితే కోటకు రెండేళ్లపాటు ఎవరూ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వలేదు. ఇక సాహసమే నా ఊపిరి పేరిట మరో మూవీ కృష్ణ తీశారు. ఎన్నికల ముందు వచ్చిన ఈ మూవీని రాజీవ్ గాంధీకి చూపించారు. ఇక ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో గండికోట రహస్యం పేరిట మరో సెటైర్ మూవీ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ విశ్వామిత్ర సినిమా తీస్తున్న సమయంలో కలియుగ విశ్వామిత్ర మూవీని విజయ చందర్ డైరెక్షన్ లో కృష్ణ బావమరిది యు సూర్యనారాయణ బాబు నిర్మించారు. మొత్తంమీద అప్పటి కాలంలో ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరి మధ్య వార్ గట్టిగానే నడిచింది.