ఇల్లు అమ్ముకున్న జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.. ఎందుకో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైయస్ట్ రేటింగ్స్ కలిగిన షోగా తెలుగు బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అలాగే ఈ షోలో స్కిట్‌లు వేసే కమెడియన్లు కూడా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ నటీనటులు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోల పక్కన నటిస్తున్నారు. అలా సినిమాల్లో కూడా జబర్దస్త్ కమెడియన్లు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

అయితే జబర్దస్త్ షోలో అందరి నటులకు రెమ్యూనరేషన్ ఒకేలా ఉండదు. వాళ్ల ఫర్‌ఫామెన్స్, క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ నిర్ణయిస్తారు. కొంతమందికి ఎక్కువ, మరికొంతమందికి చాలా తక్కువ ఉంటుంది. అలా జబర్దస్త్ లో లేడీ వేషాలతో పాపులర్ అయిన శాంతి స్వరూప్ గురించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు షోలలో పాల్గొంటున్నాడు. అయినా శాంతి స్వరూప్ సంపాదన మాత్రం చాలా తక్కువట. హైపర్ ఆది, సుధీర్, ఆటో రాంప్రసాద్ లతో పాటు శాంతి స్వరూప్ కూడా సీనియర్ జబర్దస్త్ కమెడియన్. కానీ హైపర్ ఆది, సుధీర్ లాగా శాంతి స్వరూప్ డబ్బులు సంపాదించలేకపోయాడు.

ఆర్ధిక కష్టాలతో శాంతి స్వరూప్ ఇటీవల తన సొంత ఇంటికి అమ్ముకున్నాడు. ఈ మేరకు అతడు సోషల్ మీడియలో ఒక పోస్ట్ పెట్టాడు. తన తల్లి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమెకు ట్రీట్‌మెంట్, ఆపరేషన్ చేయించేందుకు ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం వచ్చిందని ఆవేదన చెందాడు. తనకు ఒన్న ఒక్కగానొక్క ఇంటిని అమ్మేసి అమ్మకు వైద్యం చేయిస్తున్నట్లు తెలిపాడు. శాంతి స్వరూప్ కష్టాలు విని చాలామంది భావేద్వేగానికి గురవుతున్నారు. ఇంత సీనియర్ కమెడియన్ గా ఉండి ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ లో నటిస్తున్నా ఆర్ధికంగా ఇంకా దీన స్థితిలో ఉండటాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.