టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ హీరోయిన్ రష్మిక టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది .ఎక్కడ చూసిన ఈ ముద్దుగుమ్మ గురించే ఎక్కువగా వినిపిస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తోంది. మొదట నాగశౌర్యతో చలో చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీతా గోవింద మహేష్ తో సరిలేరు నీకెవ్వరు నితిన్ తో భీష్మ సినిమాలు ఈమెకు స్టార్ స్టేటస్ తీసుకువచ్చాయి.
ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ వైపు నుంచి కూడా పలు ఆఫర్లు రావడంతో అక్కడ కూడా బిజీగా ఉంటోంది .పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ సీతారామం చిత్రంలో పాకిస్తాన్ అమ్మాయిగా నటించి మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది రష్మిక చాలా తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ క్రేజీ తగ్గడానికి కారణం ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
తాజాగా రష్మిక గురించి మరొక వార్త చెబుతూ.. రష్మిక రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకొని బ్రేకప్ చేసుకున్నది అలా బ్రేకప్ చేయమన్నది ఎవరో కాదు వేను స్వామినే నట.. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అయితే ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉందని నిశ్చితార్థం తర్వాత వివాహం చేసుకుంటే కెరీర్ నాశనం అవుతుందని ఆమె జాతకంలో రాసిందని తెలిపారు.
అలా అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందింది. అయితే ఇప్పుడు మళ్లీ రష్మిక వేణు స్వామి మాటలు వినకుండా మరొక తప్పు చేస్తూ ఉండడంతో ఈమె కెరియర్ ఇలా అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.