ఆమె వల్లే మహేష్- పూరి జగన్నాథ్ మధ్య విభేదాలు వచ్చాయా..!!

ఒకప్పుడు మహేష్ బాబు, డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పోకిరి . ఈ సినిమా నుంచి మహేష్ బాబుకి స్టార్ హీరో పొజిషన్ కూడా పెరిగిపోయింది. ఆ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి మంచి పేరు దక్కింది. ఇద్దరికీ పోకిరి సినిమా నుంచి మంచి కాంబినేషన్ ఏర్పడింది. ఆ తరువాత మళ్లీ వీరిద్దరి కాంబోలో బిజినెస్ మాన్ సినిమా వచ్చింది. అది కూడా హిట్ ను సాధించింది. అయితే వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి.. మూడో సినిమా కోసం వారి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పూరి జగన్నాథ్ ఫ్లాపులతో సతమతమవుతున్నాడు అంతేకాకుండా ఈయనకి ఏ స్టార్ హీరో కూడా కాల్ షీట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు.

Pokiri Ft. Mahesh Babu Completes 15 Years, Namrata Shirodkar Shares...

ఈ సమయంలోనే పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ఈ సినిమాని మహేష్ బాబు తో తీయాలని పూరి ఎన్నో కలలు కన్నారు. కానీ పూరితో తీయటానికి మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపలేదట.. అంతేకాకుండా మహేష్ కి పూరిజగన్నాథ్ రెండు మూడు సార్లు కాల్ కూడా చేశారట.. అయినా ఆయన లిఫ్ట్ చేయలేదట..ఒక ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ ఫ్లాపుల్లో ఉండే వాళ్లని మహేష్ బాబు పట్టించుకోరు అంటూ సెటైర్ కూడా వేశారట.. ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగి పోయింది.

మహేష్ బాబు ని చాలాసార్లు కలవాలని ప్రయత్నం చేశాను. కానీ నమ్రత ఒప్పుకోలేదని సమాచారం . ఎందుకంటే అప్పటికే మహేష్ బాబు స్టార్ హీరో పొజిషన్లో ఉన్నాడు.. పూరి జగన్నాథ్ అప్పటికి నిండా మునిగిపోయి ఉన్నాడు. కాబట్టి పూరితో మహేష్ బాబు సినిమా చేస్తే మార్కెట్ డౌన్ అవుతుందని నమ్రత కూడా అపాయింట్మెంట్ ఇచ్చేది కాదట.. ఇలా వీరిద్దరూ కాంబోలో వచ్చే సినిమాపై అభిమానులకు నమ్మకం ఉంది కానీ మహేష్ బాబుకు నమ్మకం లేదట అంటూ పూరి చెప్పుకొచ్చారు.