అందాల ముద్దుగుమ్మ హనీ రోజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మలయాళంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. వీర సింహా రెడ్డి మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్ శృతి హాసన్ కంటే.. సెకండ్ హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ కే ఎక్కువ గుర్తింపు వచ్చింది.
బాలయ్యకు తల్లిగా, మరదలిగా హనీ రోజ్ అదరగొట్టింది. వీర సింహా రెడ్డి మూవీ చూశాకా.. ఇంతకాలం ఈ అందాన్ని ఎలా మిస్ అయ్యాం అని అందరూ అనుకున్నారు. బాలయ్య మూవీ తర్వాత హనీ రోజ్ తెలుగులో వరుస సినిమాలతో బిజీ అవుతుందని భావించారు. ఊహించినట్లుగానే ఆమె బిజీ అయింది. అయితే సినిమాలతో కాదు.. షాప్ ఓపెనింగ్స్ తో. ఎస్.. ఈ బ్యూటీ సినిమాల్లో కంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది.
తాజాగా కూడా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఆమె సందడి చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్కీ షాపింగ్ మాల్ కు హనీ రోజ్ రిబ్బన్ కటింగ్ చేసింది. ఈ కార్యక్రమాలో ఆమె రెడ్ కలర్ శారీలో ఎర్రమందారంలా మెరిసిపోయింది. అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు హనీ రోజ్ సినిమాల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందట. ఈ అమ్మడు రిబ్బన్ కట్ చేస్తే.. దాదాపు రూ. 60-70 లక్షలు ముట్టజెప్పాలట. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రిబ్బన్ కటింగ్కే అంత రెమ్యునరేషనా.. హనీ రోజ్ మామూల్ది కాదు భయ్యో అంటూ అభిప్రాయపడుతున్నారు.