ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన జెనీలియా.. షాకింగ్ విషయం వెల్లడించిందిగా…

ప్రముఖ హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ఈరోజు తన 36 వ పుట్టినరోజు ను జరుపుకుంటుంది. ఈ సందర్బంగా ఆమె ఏందుకు ఇండస్ట్రీ కి దూరం అయింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ‘సత్యం’ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది డీ, సై, రెడీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది.

తెలుగు ఇండస్ట్రీ లో కొన్నేళ్ల వరకూ స్టార్ హీరోయిన్ గ ఒక వెలుగు వెలిగింది. అయితే చాలామందికి జెనీలియా అనడానికంటే హ హ హాసిని అని పిలవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. బొమ్మరిల్లు సినిమా లో ఆమె నటన అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చివరిగా ఈ అమ్మడు రానా సరసన ‘ నా ఇష్టం ‘ సినిమా లో నటించింది. ఆ తరువాత రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయింది. ఇక ఇటీవల తన భర్త రితీష్ తో కలిసి ‘వేద్’ అనే సినిమాలో నటించింది. వేద్ సినిమా ని నాగచైతన్య, సమంత నటించిన మజిలీ సినిమా కి మరాఠి రీమేక్ గా తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా జెనీలియా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఈ సందర్బంగా జెనీలియా మాట్లాడుతూ ‘ జీవితంలో ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేయక తప్పదు, రెండు పడవల మీద ప్రయాణం సాగించడం కష్టం. నాకు పెళ్లి అయిన తరువాత సినిమాలను వదిలేసి వ్యక్తిగత జీవితానికి మాత్రమే సమయం కేటాయించాను. ఒకవైపు సినిమాలు, ఇంకోవైపు కుటుంబాని చూసుకోడం అంటే కుదరని పని. నేను ఇండస్ట్రీ కి దూరం అవ్వడానికి అదొక కారణం. సినిమాలకు దూరంగా ఉండడం వల్లనే ఈరోజు మంచి ఇల్లాలిగా పేరు తెచ్చుకున్నాను. భర్త కు తోడుగా ఉంటూ, పిల్లల్ని సంతోషంగా చూసుకుంటున్నాను . ఇంతకంటే గొప్ప జీవితం ఏముంటుంది ‘ అంటూ జెనిలియా కామెంట్స్ చేసింది. అయితే ఆమెకి నచ్చిన కథ దొరికితే మాత్రం కచ్చితంగా ఒక సినిమాలో నటిస్తాను అని చెప్తుంది జెనీలియా.