రూ.500 కోట్లు ఇచ్చినా అందుకు మాత్రం ఒప్పుకోను.. మాళవిక మోహనన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్రస్తుతం ఇండస్ట్రీ లో కొంతమంది హీరో హీరోయిన్లు పారితోషకం కాస్త ఎక్కువగా ముడితే చాలు కథ ఎలా ఉందొ ఆలోచించకుండా వచ్చిన ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పేస్తుంటారు. కానీ ఇంటర్వ్యూ లో మాత్రం వారు చెప్పే మాటలు కాస్త వేరుగా ఉంటాయి. కథ,పాత్రలు నచ్చితేనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాం అని చెప్తూ అభిమానుల దెగ్గర మార్కులు కొట్టేస్తుంటారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం అందరిలా కాకుండా తను ఎంచుకునే కథ కు , పాత్రల కు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను మాత్రమే ఒప్పుకుంటాను అని చెప్తుంది.

అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘రూ. 500 కోట్లు వసూలు చేసే బారి బడ్జెట్ సినిమా అయిన సరే, ఆమె పాత్ర కు ప్రాధాన్యత లేకపోతే ఆ సినిమా లో నటించను అని బల్లగుది మరి చెప్తుంది ‘ ఈ చిన్నది. ఎందుకంటే బారి బడ్జెట్ సినిమా లు హిట్ అయినప్పటికీ ఆమె పాత్ర బాలేన్నప్పుడు ఆమెకి గుర్తింపు రాదని మాళవిక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది . మోడల్ గా కేరిర్ ప్రారంభించిన మాళవిక 2013 లో ‘పట్టం బోలా ‘ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది.

అప్పటి నుండి ఒకదాని తరువాత మరొక సినిమాలో నటిస్తూ కేరిర్ లో దుసుకుపోతూనే ఉంది. మాళవిక కి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నప్పటికి, ఆమె మాత్రం ఏరికోరి సినిమాలను ఎంచుకుంటుంది. ఈ అమ్మడు విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ , ధనుష్ హీరోగా నటించిన ‘మారన్’ సినిమా లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘ తంగలాన్ ‘ సినిమా లో విక్రమ్ సరసన నటిస్తుంది. ఈ సినిమా పై మాళవిక చాలా ఆశలు పెట్టుకుంది. ఇక మాళవిక ఎప్పటికప్పుడు తనకి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఏంటర్టైన్ చేస్తూ ఉంటుంది.