రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కు 5 మంది స్టార్ హీరోలతో డీల్..!!

తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ రాజమౌళి.. బాహుబలి, RRR చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీని మరింత పాపులారిటీ అయ్యేలా చేశారు. ఆస్కార్ అవార్డు రావడమే కాకుండా ఏకంగా జాతీయస్థాయిలో కూడా ఆరు అవార్డులను అందుకోవడం జరిగింది రాజమౌళి. రాజమౌళి సినిమాలను తెరకెక్కించేటప్పుడు తనకు కావలసిన ఔట్ పుట్ వచ్చేవరకు సినిమా షూటింగ్ చేస్తూనే ఉంటారు. అది ఎన్ని రోజులైనా సరే సినిమా షూటింగ్ కంటే ఫ్రీ ప్రొడక్షన్ పైనే మరింత ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు.

Mahabharata movie will be made in ten parts; SS Rajamouli says that it is a  dream project for him - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

RRR సినిమా తర్వాత మహేష్ తో ఒక అడ్వెంచర్ మూవీని పాన్ వరల్డ్ గా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే అంచనాలు తగ్గకుండా ఈ సినిమా తీసేందుకు రాజమౌళి చాలా కసరత్తులు చేస్తున్నారని చెప్పవచ్చు..ప్రస్తుతం ఈ కథ పైన రాజమౌళి తండ్రి ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు.ఈ సినిమా తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం పైన దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం.

మహాభారతాన్ని సినిమాగా తీయాలని రాజమౌళి ఎప్పటినుంచో కలలు కంటున్నారు. ఒకవేళ మహాభారతం ప్రాజెక్టు మొదలు చేస్తే 10 భాగాలుగా తెరకెక్కిస్తారని అప్పట్లో తెలియజేశారు.. అయితే ఈ ప్రాజెక్టుకి ఎవరెవరిని ఎంచుకున్నారని విషయం పైన ప్రచారం జరుగుతోంది వాటి గురించి తెలుసుకుందాం.. మహాభారతంలో ప్రభాస్ ,ఎన్టీఆర్ ,మహేష్ బాబు ,రామ్ చరణ్ లతో రాజమౌళి మహాభారతాన్ని తీయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ప్రభాస్ కర్ణుడిగా ,మహేష్ బాబు కృష్ణుడుగా, రామ్ చరణ్ అర్జునుడిగా, ఎన్టీఆర్ భీముడు పాత్రలో సెట్ అవుతారని రాజమౌళి భావించినట్లు సమాచారం. అల్లు అర్జున్ కూడా ఇందులో ఏదో ముఖ్యమైన పాత్రలో నటించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇండియన్ హిస్టరీ షేక్ అవడం ఖాయమని పలువురు అభిమానులు తెలుపుతున్నారు.