హీరోగా మారిన కమెడియన్ వెన్నెల కిషోర్..!!

టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయం అవసరం లేనటువంటి కమీడియన్ గా పేరుపొందారు నటుడు వెన్నెల కిషోర్.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగే వెన్నెల కిషోర్ ప్రస్తుతం ఉన్న టాప్ కమెడియన్లలో ఒకరని కూడా చెప్పవచ్చు.. ఎలాంటి సందర్భంలోనైనా సరే తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించగలరు.. తన మొదటి సినిమా వెన్నెల దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పరచుకున్న వెన్నెల కిషోర్ ఇప్పుడు ఏకంగా హీరోగా సరికొత్త అవతారాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.

ఇప్పుడు ఆయన హీరోగా మారుతూ స్పై యాక్షన్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. అక్కినేని హీరో సుమంత్ తో మళ్ళీ మొదలైంది అనే సినిమా చేసిన డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ వెన్నెల కిషోర్ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి డిఫరెంట్గా చారి-111 అనే టైటిల్ ని కూడా ఖరారు చేయడం జరిగింది . ఇందులో సీనియర్ నటుడు మురళి శర్మ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. సంయుక్త విశ్వనాథన్ ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించబోతోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలై బాగానే ఆకట్టుకుంటుంది వెన్నెల కిషోర్ సూటు బూటు వేసుకొని చేతిలో గన్ను పట్టుకొని కనిపించారు.. ఈ పోస్టర్ యానిమేషన్ తో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే గ్లింప్స్ కూడా యానిమేషన్ తరహాలో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది .ఇందులో నటుడు, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్ కూడా నటిస్తూ ఉన్నారు. యాక్షన్ కామెడీ చిత్రంగా ఉండబోతుందని చిత్ర బృందం తెలియజేసింది ప్రస్తుతం అందుకు సంబంధించి గ్లింప్స్ వైరల్ గా మారుతోంది.