మెగాస్టార్ చిరంజీవి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తొలిసారి `భోళా శంకర్` మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వమించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తే.. చిరంజీవి చెల్లెలు పాత్రను కీర్తి సురేష్ పోషించింది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. ఆగస్టు 11న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి.
ఇకపోతే ఇటీవల బయటకు వచ్చిన `జాం జాం జజ్జనక` సాంగ్ మేకింగ్ వీడియోలో చిరంజీవి కీర్తి పీక పట్టుకోవడం గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా ఈ విషయంపై చిరంజీవి ఓపెన్ అయ్యాడు. కీర్తి పీక పట్టుకోవడం వెనక కారణం ఏంటో వెల్లడించారు. భోళా శంకర్ షూటింగ్ టైమ్ లో కీర్తి సురేష్ కు చిరంజీవి ఇంటి నుంచే భోజనం వచ్చేదట. చిరంజీవి చెఫ్.. కీర్తి సురేష్ కోసం ప్రతిరోజు రకరకాల వంటకాలు తయారు చేసి పంపేవాడట.
అవి తిని ఊరుకోకుండా దానిలో అది తక్కువ అయ్యింది, అందులో ఇది ఎక్కువ అయ్యింది అని చెప్పేదట. ఒక్కోసారి ఏం కావాలో డిమాండ్ చేసేదట. ఇక ఒక రోజు చిరంజీవి షూటింగ్ లో బిజీగా ఉండగా.. కీర్తి సురేష్ వెళ్లి రేపు మెనూ ఏంటని అడిగిందట. ఆ మాటకు కోపం వచ్చే కీర్తి పీక పట్టుకున్నానని.. అందుకు సంబంధించిన షాట్ నే మీరు వీడియోలో చూశారని చిరంజీవి సెట్స్ లో జరిగిన రచ్చను బయపెట్టారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలతో చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని స్పష్టంగా తేలిపోయింది.