పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయిలో వచ్చిన `బ్రో` బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ ను సొంతం చేసుకుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ మ్యానియాలో మొదటి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల రేంజ్ లో వసూళ్లను అందుకున్న బ్రో.. వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాక బెండ్ అయిపోతూ వచ్చింది.
ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 97 కోట్ల రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరిగగా.. రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో జూలై 28న బరిలోకి దిగింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్ట్యా బ్రో ఈ టార్గెట్ ను రీచ్ అయిపోతుందని అనుకున్నారు. కానీ, కంటెంట్ లేకపోయినా పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు అని బ్రో నిరూపించింది.
ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 50.71 కోట్ల షేర్, రూ. 79.75 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 63.21 కోట్ల షేర్, రూ. 105.80 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ఇంకా రూ. 35.29 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకోవాల్సి ఉంది. కానీ, మిక్స్డ్ టాక్ తో బ్రో ఇంత భారీ టార్గెట్ ను రీచ్ అవ్వడం అసాధ్యం. ఈ నేపథ్యంలోనే బయ్యర్లు లబోదిబోమంటున్నారు. కలెక్షన్స్ లేకపోవడం వల్ల కొన్ని చోట్ల బ్రోను ఎత్తేసి `బేబీ` మూవీని ప్రదర్శిస్తుండటం గమన్నార్హం.