పాలిటిక్స్‌లోకి అన‌సూయ‌… ఆ పార్టీ నుంచి పోటీకి రెడీ…?

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ ఇటీవలే ఒక ఎమోషనల్ వీడియో కారణంగా మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతోంది.ఈమెకు సంబంధించిన పలు విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యనే అనసూయ జాతకం పైన కూడా ప్రముఖ ఆస్ట్రాలజీ వేణు స్వామి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో జ్యోతిష్య శాస్త్ర అదృష్టవంతురాలు అంటూ అనసూయను పొగడ్తలతో ముంచేయడం జరిగింది వేణు స్వామి.

Playing Sucharita Reddy in Yatra was an unforgettable experience: Anasuya  Bharadwaj | Telugu Movie News - Times of India

ఇప్పుడు తాజాగా వేణు స్వామి మాటలు నిజం కాబోతున్నాయి అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .అనసూయ లైఫ్ లో 2021 తర్వాత ఆమె జీవితం గణనీయమైన మార్పులు వస్తాయని తెలియజేశారు. అనుకున్నట్టుగానే ఆమెకు పలు సినిమాలలో అవకాశాలు రావడమే కాకుండా పలు రకాల వాటిలో కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. టెలివిజన్ నుంచి వెండితెరకు మారడమే కాకుండా ప్రత్యేకమైన గుర్తింపును కూడా అందుకుంది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేతిలో పలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనసూయ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుందని అది కూడా అధికార పార్టీ అయినా వైసీపీ పార్టీలో ఈమె ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.. ఒకవేళ ఈమె ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఈమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమాలో కూడా అనసూయ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇప్పుడు మళ్లీ వైసీపీ పార్టీలు చేరబోతోంది అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.